సరిగ్గా అ,ఆ లు అక్షరాలు నేర్చుకోకపోతే వరాహి కి, వారహి కి తేడా తెలియదు ఈ ముఖ్యమంత్రి కి
భీమవరం నియోజకవర్గ జనసైనికులు, వీర మహిళలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశంలో మాట్లాడిన ముఖ్యంశాలు:
సరిగ్గా అ,ఆ లు అక్షరాలు నేర్చుకోకపోతే వరాహి కి, వారహి కి తేడా తెలియదు ఈ ముఖ్యమంత్రి కి, జనసేన వయోజన సంచార పాఠశాల పథకం క్రింద, ఈ ముఖ్యమంత్రికి నేనే అక్షరాలు, ఒత్తులు నేర్పిస్తాను
ఒక నియంత, కంఠకుడు, తెలుగు ఉచ్చారణ రాని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందరం బాధపడుతున్నాము
గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భీమవరం ప్రజలు ఎంతో సహకరించారు. ఖచ్చితంగా భీమవరం లో జనసేన జెండా ఎగరేస్తాము
మన చేత 24 గంటల్లో తిట్టించుకొకపోతే, తిట్టించుకునేలా వెధవ పనులు చెయ్యకపోతే మేము YSRCP నాయకులమే కాదు అన్నట్లుగా ఉన్నారు
అమ్మఒడి పథకం కార్యక్రమానికి వెళ్లి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి? నేను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగింది, ఊరికే చూపించలేదు
ఒత్తిడి తీసుకోకుండా మర్పబ్రాడు, కేసులు ఉంటాయి భయపడకండి, దైర్యం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రండి, దైర్యం లేనివాళ్ళు రాజకీయాల్లోకి రాకండి , ఒక్క ధైర్యం ఉన్న వ్యక్తి అయినా చాలు
పెన్షన్ రాకపోయినా MLA సంతకం తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇందుకేనా MLA పదవులు
మహాత్మా గాంధీ గారి సతీమణి కస్తూర్బా గాంధీ గారి పేరు కళాశాలకు తీసేయడం ఏంటి
ప్రతీ ఒక్కరూ భవిష్యత్తులో కూడా జనసేనతో నడవాలి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో YSRCP జెండా ఎగరకూడదు, దానికి మనం పనిచేయాలి, 30వ తారీఖున కారణాలు చెబుతాను
