అంతర్జాతీయంమీడియా

జర్మనీ చేరుకున్న శ్రీ నాగబాబు

Share this Post

మ్యూనిచ్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

యూరోప్ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు జర్మనీ చేరుకున్నారు. మ్యూనిచ్ విమానాశ్రయంలో శ్రీ నాగబాబు గారికి ఎన్ఆర్ఐ జనసేన జర్మనీ విభాగం సభ్యులు ఘన స్వాగతం పలికారు. మ్యూనిచ్ నగరంలో జర్మనీకి చెందిన జనసైనికులు, వీరమహిళలతో ఆయన ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. వారం రోజులుగా యూరోప్ లో పర్యటిస్తున్న శ్రీ నాగబాబు గారు మూడు రోజుల పాటు లండన్ లో, రెండు రోజుల పాటు ఐర్లాండ్ లో పర్యటించి పార్టీ మద్దతుదారులు, ఎన్ఆర్ఐ విభాగం సభ్యులతో మమేకమైన విషయం తెలిసిందే. నెలాఖరుకు నెదర్లాండ్స్ చేరుకొని అక్కడి జనసైనికులు, వీరమహిళలతో సమావేశమవుతారు. పార్టీ బలోపేతం, పార్టీ ఉన్నతికి జర్మనీలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలు, భవిష్యత్తు కార్యక్రమాల మీద సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *