ఆంధ్ర ప్రదేశ్కర్నూలుమీడియా

అనంతలో 9న జనసేన జయభేరికి అంకురార్పణ.! వైసీపీని గద్దె దింపుతాం అనంతలో జనసేన జెండా ఎగురవేస్తాం.!

Share this Post

అనంతలో 9న జనసేన జయభేరికి అంకురార్పణ.! వైసీపీని గద్దె దింపుతాం అనంతలో జనసేన జెండా ఎగురవేస్తాం.! గత నాలుగున్నర సంవత్సర కాలంలో అధికార వైసిపి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనసేన అధికారంలోకి వస్తే జరగబోయే మేలును వివరిస్తూ ఈనెల 9వ తేదీ నుండి జనసేన జయభేరి కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నట్లు జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ టీ.సీ.వరుణ్ గారు తెలిపారు. శనివారం స్థానిక సప్తగిరి సర్కిల్ లోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వరుణ్ గారు మాట్లాడారు. జనసేన జయభేరి కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 50 డివిజన్లు, నాలుగు పంచాయతీలలో విస్తృతంగా పర్యటిస్తామన్నారు. స్థానిక నాయకులను సమన్వయం చేసుకొని.. స్థానిక ప్రజలతో మమేకం అవడం ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో ఇచ్చే హామీలకు విస్తృత స్థాయిలో ప్రచార కల్పిస్తూ.. జనసేన పార్టీని ఆదరించి, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. వైసిపి అధికారంలోకి రాకముందు అనంత నగర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో నాయకులను నిలదీస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను వైసిపి పార్టీ కార్యకర్తలకు మాత్రమే పరిమితం చేసిన అన్యాయాన్ని ఎదిరించి.. స్థానిక సమస్యలపై సమరభేరి ముగిస్తూ జనవాణి వినిపిస్తామన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వైసిపిని గద్దె దింపుతాం.. ముమ్మాటికి అనంతలో జనసేన జెండా ఎగురవేస్తామని శ్రీ టి.సి.వరుణ్ గారు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు, కార్యక్రమాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జయరాంరెడ్డి, శ్రీ అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీ కుమ్మర నాగేంద్ర, కార్యదర్శిలు శ్రీ రాపా ధనుంజయ్, శ్రీ సంజీవ రాయుడు, శ్రీ కిరణ్ కుమార్, శ్రీ విజయ్ కుమార్, శ్రీ ముప్పూరి కృష్ణ, శ్రీమతి. జయమ్మ, నగర ఉపాధ్యక్షులు శ్రీ సదానందం, శ్రీ గ్రంధి దివాకర్, శ్రీ జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు శ్రీ మేదర వెంకటేష్, శ్రీ రోళ్ళ భాస్కర్, శ్రీ వెంకటనారాయణ, శ్రీ హుస్సేన్, శ్రీ దరాజ్ భాషా, కార్యదర్శులు శ్రీమతి జక్కిరెడ్డి పద్మావతి, శ్రీమతి సువర్ణమ్మ, శ్రీ లాల్ స్వామి, శ్రీ మురళి, శ్రీ విశ్వనాధ్, శ్రీ శేషాద్రి, శ్రీ సంపత్, శ్రీ వెంకటేష్, శ్రీ వెంకటరమణ, శ్రీ ఆకుల ప్రసాద్, శ్రీ ఆకుల అశోక్ మరియు వీరమహిళలు శ్రీమతి అనసూయ, నాయకులు శ్రీ హిద్దు, శ్రీ జయకృష్ణ, శ్రీ sku రమణ, శ్రీ మధు, శ్రీ నవీన్, శ్రీ నౌషాద్, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. – జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ TC.వరుణ్ గారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *