ఆంధ్ర ప్రదేశ్తిరుపతిమీడియా

ఈ నెల 17న తిరుపతికి శ్రీ పవన్ కళ్యాణ్

Share this Post

శ్రీ కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి వినతిపత్రం

శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకుడు శ్రీ కొట్టే సాయిపై అమానుషంగా దాడి చేసిన సీఐ శ్రీమతి అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఉదయం తిరుపతి జిల్లా ఎస్పీకి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినతిపత్రం సమర్పిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. జిల్లా ఎస్పీ ద్వారా రాష్ట్ర డీజీపీ దృష్టికీ ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 9గం. 30ని.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 10గం. 30ని.లకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందిస్తారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *