జాతీయంమీడియా

ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీ చేరిన శ్రీ పవన్ కళ్యాణ్

Share this Post

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సమావేశం నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం నిర్వహించే ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు. ఢిల్లీ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ సీనియర్ కేంద్ర మంత్రులు సైతం వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చ ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *