జాతీయంమీడియా

కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షాతో శ్రీ పవన్ కళ్యాణ్ భేటీ

Share this Post

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారితో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సుమారు 25 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్తమాన రాజకీయ అంశాలతోపాటు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు శ్రీ అమిత్ షా గారితో జరిగిన చర్చలు దోహదపడతాయి అన్నారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *