ఆంధ్ర ప్రదేశ్మీడియావిజయవాడవిశాఖపట్టణం

జనసేన పార్టీలో చేరిన మాజీ శాసనసభ్యుడు శ్రీ పంచకర్ల రమేష్ బాబు

Share this Post

  • వైసీపీ నుంచి జనసేనలో చేరిక

విశాఖ జిల్లా, పెందుర్తికి చెందిన మాజీ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గురువారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కండువా వేసి శ్రీ రమేష్ బాబుని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరేందుకు వందలాది మంది అభిమానులతో కలసి విశాఖ నుంచి భారీ ర్యాలీగా శ్రీ రమేష్ బాబు కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. జీవితకాలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. శ్రీ రమేష్ బాబు మా ఇంట్లో వ్యక్తి లాంటి వారని, పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఉంటుందని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *