ఆంధ్ర ప్రదేశ్తిరుపతిమీడియా

పుల్లంపేట రోడ్డు ప్రమాదం బాధాకరం

Share this Post

కడప నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట దగ్గర లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడటం బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. గాయాల పాలైన పది మందికీ మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను కోరుతున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని, తగిన ఆర్థిక సహాయం అందించాలి. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అతి వేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని వివిధ మాధ్యమాల ద్వారా తెలిసింది. పోలీసు, రవాణా శాఖల అధికారులు రహదారి భద్రత చర్యల్లో భాగంగా వేగ నియంత్రణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని జనసేనాని తెలిపారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *