అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి గారు.
ఈనెల 14వ తేదీ నుండి అన్నవరం నుండి ప్రారంభమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుతూ అన్నవరం శ్రీ సత్య దేవుని సన్నిధానంలో మరియు చేబ్రోలు సత్తెమ్మ తల్లి ఆలయంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ‘శ్రీమతి మాకినిడి శేషు కుమారి’ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గోత్రనామాలతో పూజలు నిర్వహించారు అనంతరం వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుతూ పిఠాపురం టౌన్ జనసేన నాయకులు పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, మేళం రామకృష్ణ,జనసేన నాయకులు వీర మహిళలు జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారి చేతుల మీదుగా వారాహి యాత్ర పోస్టర్లను, బ్యాడ్జీలను ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి, చేబ్రోలు సత్తమ్మ తల్లి ఆశీస్సులతో 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అలాగే మన నియోజకవర్గ నాయకులు జనసైనికులు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ యాత్ర విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి, మేళం రామకృష్ణ, గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, మహిళ ప్రెసిడెంట్స్ కోలా దుర్గ , వినుకొండ అమ్మాజీ, కేతినిడి గౌరీ నాగలక్ష్మి,అల్లం దొరబాబు,పెద్దింటి శివ, బుద్ధాల చంటిబాబు, దమ్ము చిన్న, బుద్ధల శ్రీనివాస్, కర్రీ శివ, వద్దులేటి చిట్టిబాబు, ఉలిశెట్టి సుబ్బారావు, ఏ సురేష్, బడాల సురేష్, పెనుగొండ సోమేశ్వరరావు, గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, ఉమ్మడి బోడకొండ, గొల్లపల్లి నరసింహులు, పెనుగొండ వెంకటేశ్వరరావు, బండి బుజ్జి, యాండ్రపు శ్రీనివాస్, రసంశెట్టి కన్యాకర్ రావు, కంద సోమరాజు నామ, శ్రీకాంత్,పబ్బినిడి దుర్గాప్రసాద్, గంటా బాబి, పిట్ట చిన్న, జన సైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Pithapuram Constituency Janasena Party Incharge Mrs. Makineedi Seshu Kumari conducted special pujas in Annavaram Shri Satyanarayana Swami Sannidhanam.
