శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలోతెనాలి జనసేనలో చేరికలు
తెనాలి నియోజక వర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు జనసేనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో చేరారు. తెనాలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శ్రీ హరిదాసు గౌరీశంకర్, శ్రీ దొడ్డెంపూడి నాగరాజు, శ్రీ ఎర్రు వెంకటేశ్వర రావు, శ్రీ పాలడుగు లక్ష్మీనారాయణ, శ్రీ కేతావత్ భాను నాయక్ లకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
